రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
NEWS Aug 27,2024 06:27 am
రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లోని నాలుగు, ఐదు ప్లాట్ ఫారములపైకి వెళ్లే కాలిబాట వంతెన మెట్ల మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ప్రయాణికుల సమాచారం మేరకు సోమవారం జీ ఆర్ పీ ఎస్ ఐ మావూళ్ళు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వయసు 45 ఏళ్లు ఉంటుందని చెప్పారు. వివరాలు తెలిసిన వారు 94910 03239 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలపాలన్నారు.