ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో మంగళవారం ఏజెన్సీ బంద్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట నాయకులు ధర్నా చేపట్టి బస్సులను బయటకు వెళ్లనీయకుండా నిలిపివేశారు. ఆదివాసీల ఆందోళన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జీవో నంబర్ ఎంఎస్ 3ను యథావిధిగా కొనసాగించాలని నాయకులు డిమాండ్ చేశారు.