విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మళ్ళీ ఉద్రిక్తత
NEWS Aug 07,2026 02:19 pm
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పూర్మనందపేట బాప్టిస్ట్ నగర్లో వైకాపా దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా దీక్షా శిబిరం ఏంటని తెలుగుదేశం ఆందోళన చేపట్టింది. నిరుద్యోగులు, బాధితులు ఎవరూ లేకుండా పెయిడ్ ఆర్టిస్టులతో దొంగ శిబిరాలు నడుపుతున్నారంటూ టీడీపీ నిరసన తెలిపింది.