నాలుగేళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి కి .. రేషన్ డీలర్ బియ్యం పంపిణీ?
NEWS May 09,2025 01:49 pm
kMR:పాల్వంచ మండలం ఆరేపల్లిలో చనిపోయిన వ్యక్తి పేరిట నాలుగేళ్లుగా రేషన్ బియ్యం తీసుకుంటున్నట్టు ఆరోపణలు వెలుగుచూశాయి. బాధితురాలు జమున మాట్లాడుతూ.. 2021లో మృతి చెందిన తన మామయ్య పెంటయ్య పేరుతో తన మరిది భూమయ్య మొబైల్ ఓటీపీ ద్వారా రేషన్ తీసుకుంటున్నాడని చెప్పారు. ఈ విషయంపై పాల్వంచ తహశీల్దార్ స్పందించారు. దీనిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.